సీఎం జగన్’పై మెగా ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఆదివారం ఒక్కరోజే ఏపీలో 13.72లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ భేష్ అంటూ ట్విట్ చేశారు.

“ఏపీలోని ఆరోగ్య బృందాలు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్లు ఇచ్చి అద్భుతమైన ఫీట్ సాధించాయి. మీ ఈ ప్రయత్నాలు కరోనాను ఎదుర్కొనడంలో ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని నింపుతాయి. సీఎం జగన్ గారి స్ఫూర్తివంతమైన నాయకత్వానికి అభినందనలు” అంటూ చిరు ట్వీట్ చేశారు.

సీఎం జగన్ ని మెగాస్టార్ పొడగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో చాలాసార్లు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు చిరు. దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా ? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే అన్నయ్య పొగడ్తలు తమ్ముడిని ఇబ్బంది పడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ ని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గట్టిగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి భాజాపా-జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ సొంత కుటుంబ సభ్యులు సీఎం జగన్ ని తరచూ పొగడటం.. ఆయనకి ఇబ్బంది కలిస్తుందని జనసైనికులు అంటున్నారు.

So happy at the fabulous feat of vaccinating over 13.72 lac people in a single day by Health teams in #AndhraPradesh.Your efforts fill confidence in everyone about defeating the Covid monster! Way to go TeamAP. More Power to You!Congrats to Sri @ysjagan for inspiring leadership.— Chiranjeevi Konidela (@KChiruTweets) June 22, 2021