జగన్ గజదొంగ.. రోజా కౌంటర్ !

తెలుగు రాష్ట్రాలు ఏపీ-తెలంగాణ మధ్య నీటి జగడం కొనసాగుతూనే ఉంది. నేరుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిట్టుకోకున్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. సోమవారం తెలంగాణ మంత్రి  వేముల ప్రశాంత్‌ రెడ్డి.. ఏపీ సీఎం జగన్ నీటి గజదొంగ అని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.వైఎస్ఆర్ నీటి దొంగ అయితే.. జగన్ గజదొంగ అన్నారు.

ప్రశాంత్‌ రెడ్డి కామెంట్స్ తాజాగా  వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవడం లేదనే విషయం ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఒక మంత్రి అయి ఉండి సీఎం జగన్ గజదొంగ అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు.

ఇక ఇటీవల రెండు శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోజా.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు. రాజకీయాల నుంచి కొద్దిరోజు బ్రేక్ తీసుకున్నారు. ఎవరిపై రాజకీయ ఆరోపణలు చేయలేదు. ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కానీ మునుపటి ఫైర్ ఆమె లో కనిపించలేదు. సీఎం జగన్ ని గజదొంగ అంటే.. ఆ వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ రెడ్డి విజ్ఝతకే వదిలేస్తున్నామని రోజా అనడం.. అంత ఈజీగా వదిలేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మునుపటి రోజా అయితే ఓ రేంజ్ లో చీల్చి చెండాడేది.