కొలతలు-లెక్కలు మారాయ్

ఇప్పుడు సినీ లెక్కలు మారిపోయాయ్ అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత స్టార్ డమ్, స్టార్స్ ప్రాభవం తగ్గిందని చెబుతోంది. ఓటీటీ వచ్చిన తర్వాత స్టార్ డమ్ మసకబారింది. హీరోయిజం కాస్త తగ్గింది. ఒకప్పుడు హీరోలు ఇలానే ఉండాలి, హీరోయిన్లు ఇలానే కనిపించాలనే కొలతలు-లెక్కలు ఉండేవని.. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత కథలు, హీరోహీరోయిన్లు క్యారెక్టరైజేషన్లు మారిపోయాయని అంటోంది. 

ఓటీటీలో నటీనటులకు ఎప్పుడూ టాప్ లో ఉండడం అవసరం. ప్రతిసారి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఓటీటీలో కుప్పలుతెప్పలుగా కంటెంట్ ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుంటాయి. నటులుగా మనం వాటిని తెలుసుకోవాలి, అందిపుచ్చుకోవాలని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. తమన్నా నటించిన 11అవర్ వెబ్ సిరీస్ ఆహా యాప్ లో అందుబాటులో ఉంది.