సురేశ్‌బాబు కూడా మోసపోయారు !

‘సురేష్ బాబు కూడా మోసపోయారు’ అనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో  హాట్ టాపిక్ గా మారింది. సురేష్ బాబు పొదుపరియే కాదు.. అత్యంత జాగ్రత్తపరుడు. అలాంటి సురేష్ బాబుకే ఓ వ్యక్తి టోకరా ఇచ్చాడు. టీకాలు ఇప్పిస్తానంటూ.. 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేశ్‌బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్‌ చేశాడు. తన భార్య బ్యాంకు ఖాతాకు రూ.లక్ష బదిలీ చేయాలని కోరాడు. అతడి మాటలు నమ్మి రూ.లక్ష బదిలీ చేశారు సురేశ్‌బాబు. నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు.

చివరికి పోసపోయానని తెలుసుకున్న సురేష్ బాబు..  నాగార్జునరెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగార్జున రెడ్డిని నాలుగు రోజుల క్రితమే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్‌ పీఏ నంటూ నమ్మించి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్ ప్రతినిధిని మోసగించాడు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్‌లో రిమాండ్ ఖైదీగా నాగార్జున రెడ్డి ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలో మరో సినీ ప్రముఖుడిని నాగార్జున రెడ్డి మోసం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.