దారుణం : ప్రసాదం ఇవ్వడానికి వెళ్లిన బాలికపై స్వామీజీ అత్యాచారం

తెలంగాణలో బాలికపై ఓ స్వామీజీ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం దుర్గానగర్‌కు చెందిన జాదవ్‌ ఆత్మారాం మహరాజ్‌(26) ఏడేళ్లుగా రాజుర గ్రామ శివారులోని గుట్టపై ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. గుట్టపై శివాలయంలో పూజలకు భక్తులు వెళ్తుంటారు. వేసవి కాలం కావడం, ఆ ఆశ్రమం వద్ద నీటి సౌకర్యం లేకపోవడంతో ఇస్పూర్‌ మథురతండా గ్రామస్తులు మహరాజ్‌ను గ్రామంలోని ఆలయం వద్ద గల ఆశ్రమంలో ఉంచారు.