బాబాయ్’ని టెన్షన్ పెడుతున్న జగన్

ఏపీ సీఎం జగన్.. బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని టెన్షన్ లో పెట్టేశారు. ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఖాళీ. ఆయన రెండు పదవులు ఒకేసారి పోయాయ్. అటు ఎమ్మెల్సీ పదవికాలం పూర్తయి రెండ్రోజులు అవుతోంది. ఇటు టీటీడీ చైర్మన్ గా ఆయన రెండేళ్ల పదవికాలం కూడా ముగిసింది. తనకు మరోసారి పదవి పొడిగింపు లభిస్తుందని టీటీడీ వర్గాలందరికీ సుబ్బారెడ్డి చెబుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రికి అలాంటి ఆలోచన ఉంటే.. పొడిగింపు ఉత్తర్వులు పదవీ కాలం ముగింపునకు ముందే ఇచ్చి ఉండేవారని అంటున్నారు.

టీటీడీ బోర్డు పదవి కాలాన్ని ప్రతీ సారి ఏడాదికి మాత్రమే ఎంపిక చేస్తారు. కానీ సీఎం జగన్ జంబో బోర్డును ఏర్పాటు చేసి.. రెండేళ్ల పదవీ కాలం ఇచ్చారు. అది కూడా పూర్తయింది. ఆ పదవిని కూడా ఇతరులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతూండటంతో సుబ్బారెడ్డి టెన్షన్ లో పడ్డారని తెలుస్తోంది. మరీ.. బాబాయ్ కి సీఎం జగన్ ఏ రకంగా న్యాయం చేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.