కడియం శ్రీహరి ఇంట్లో విషాదం

తెరాస సీనియర్‌ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో విషాదం  నెలకొంది. ఆయన సోదరుడు ప్రభాకర్‌ (51) గుండెపోటుతో మృతి చెందారు. హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోట పాఠశాలలో ప్రభాకర్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ ఉదయం స్వగ్రామం పర్వతగిరిలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు రాజకీయ ప్రముఖులు కడియం శ్రీహరి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.