మరో తెలుగు సినిమాని ఓకే చేసిన ధనుష్

కోలీవుడ్ హీరో ధనుష్ నేరుగా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్నారు. తమిళ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లక ముందే ధనుష్ మరో తెలుగు సినిమాని కూడా ఓకే చేశారని సమాచారమ్. 

ఓ యంగ్ డైరక్టర్ కాంబినేషన్ లో.. ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోందని తెలిసింది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలోనూ ఈ సినిమాని తీసుకొస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఏది ముందు ప్రారంభం అవుతుంది అన్నది చూడాల్సి వుంది. ఎందుకంటే ? శేఖర్ కమ్ముల కేవలం లైన్ మాత్రమే చెప్పారు. పూర్తి స్కిప్ట్ ని రెడీ చేసి.. చెప్పాల్సి ఉంది. మరోవైపు యంగ్ డైరెక్టర్ పూరి స్కిప్ట్ తో రెడీగా ఉన్నాడు. ఆ స్కిప్ట్ ని ధనుష్ ఓకే చేశాడు కూడా. అందువల్ల ఏది ముందు ప్రారంభం అవుతుందో అన్నది చూడాల్సి వుంది.