బాలీవుడ్ ‘నాంది’లో అజయ్ దేవగణ్

టాలీవుడ్ హిట్ చిత్రం ‘నాంది’ బాలీవుడ్ కు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని అజయ్ దేవగణ్ తో కలిసి దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ మేరకు దిల్ రాజు ప్రకటన చేశారు. హీరోగా అజయ్ దేవగణ్ నే నటిస్తారా ? లేదా మరో హీరోని తీసుకుంటారా ? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. మాతృక దర్శకుడే బాలీవుడ్ నాందికి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి.

తెలుగు ‘నాంది’ చిత్రానికి కొత్త ద‌ర్శ‌కుడు విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. అల్లరి నరేష్ కెరీర్ లో గొప్పగా చిత్రంగా నిలిచింది. లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించారు. ఇందులో ఆర్టికల్ 321ని గురించి ప్రధాన చర్చించారు. ఇప్పుడీ.. ఈ కథ బాలీవుడ్ కి వెళ్లనుండటంతో మరింత మందికి చేరువ కానుంది.