పల్లె, పట్టణ ప్రగతి నిధులు విడుదల

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జులై 1 నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై మంత్రులు, ఉన్నతాధికారు లతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అమలు చేయనున్న కార్యక్రమాలపై చర్చించారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్‌లో ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోందని, అలాంటప్పుడు పనులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో సమీక్షించుకోవాలని అధికారులకు సూచించారు.