బ్రేకింగ్ : తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి

ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ధైర్యం చేసింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటించింది. కొత్త పీసీసీ చీఫ్ ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం రెండేళ్లుగా జాప్యం చేస్తున్న సంగతి తెలిసిందే.

గతంలోనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ పేరుని ఖరారు చేసింది. కానీ సీనియర్లు మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో.. ఆగిపోయింది. ఆ తర్వాత రాష్ట్రల నేతల అభిప్రాయం పేరుతో కాలయాపన చేసింది. అయితే రోజురోజుకి తెలంగాణ లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవుతున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు ధైర్యం చేసింది. కొత్త పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించింది.