నకిలీ టీకాతో గ్లామర్ ఎంపీకి అస్వస్థత

టీఎంసీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఆమె అనారోగ్యానికి గురికావడం నకిలీ టీకానే కారణమని చెబుతున్నారు. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్ కమిషనర్‌ (ఐఏఎస్ క్యాడర్‌)గా నమ్మించి దేవాంజన్ దేవ్‌ అనే వ్యక్తి మిమి చక్రవర్తిని కోల్‌కతా సమీపంలో నిర్వహించిన ఓ టీకా కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రజలకు టీకాపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ఆమె కూడా టీకా వేయించుకున్నారు.

ఆ తర్వాత అది నకిలీ కార్యక్రమమని గుర్తించి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ టీకా వేయించుకున్న ఎంపీ మిమి చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. డీహైడ్రేషన్, కడుపునొప్పి, బీపీ తగ్గిపోతుంది. ఆమె పరిస్థితికి టీకానే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. ఎంపీని ఇలా నకిలీ టీకాతోమోసపోతే.. సాధారణ జనాల పరిస్థితి ఏంటీ ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.