కొత్తగా 46,148 కేసులు, 979 మరణాలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,148 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 979 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,02,79,331 చేరగా..3,96,730 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక క్రియాశీల కేసులు 5,72,994కు చేరాయి. క్రియాశీల రేటు 1.89 శాతానికి పడిపోగా..రికవరీ రేటు 96.80 శాతానికి పెరిగింది. నిన్న 58,578 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.93 కోట్లు మార్కును దాటాయి.