పాపం.. కంటి చూపు కోల్పోయిన‌ కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు, నటుడు క‌త్తి మ‌హేశ్ రెండ్రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో క‌త్తి మ‌హేశ్ త‌ల‌, ముక్కు, కంటికి తీవ్ర గాయాల‌పాల‌య్యాయి. ప్రస్తుతం చెన్నైలోని అపోలో హాస్పత్రిలో మహేష్ వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు. రెండు క‌ళ్ల‌కు నేడు ఆప‌రేష‌న్ చేయ‌నున్నారు.

ఇప్పటికే కత్తి మహేష్ ఎడ‌మ కంటి చూపు కోల్పోయిన‌ట్టు స‌మాచారం. ఈ విష‌య‌మై వైద్యులు త‌మ‌కు చెప్పిన‌ట్టు క‌త్తి మ‌హేశ్ మేన‌మామ ఎం.శ్రీ‌రాములు మీడియాకు చెప్పారు. అయితే త‌ల‌లో ర‌క్త‌స్రావం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో ప్రాణాపాయం త‌ప్పిన‌ట్టు వైద్యులు చెప్పార‌న్నారు. ఈరోజు రెండు క‌ళ్ల‌కు ఆప‌రేష‌న్ చేయ‌నున్నారు.