ధనుష్ మూడో తెలుగు సినిమా ఖరారు

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా ధ‌నుష్ కి క‌థ చెప్పిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే.. ధ‌నుష్ చేతిలో రెండు సినిమాలున్నాయ‌న్న‌మాట‌. అంతేకాదు.. ధనుష్ కోసం మూడో తెలుగు కథ కూడా రెడీ అయిందట.

‘సాహో’ ద‌ర్శ‌కుడు సుజిత్ కూడా ధ‌నుష్ కోసం ఓ క‌థ సిద్ధం చేశాడ‌ని సమాచారమ్. త్వరలో ధనుష్ ని కలిసి కథ వినిపిస్తాడట. ఇది కూడా ఓకే అయింది. మూడు తెలుగు కథలని ధనుష్ ఓకే చెప్పినట్టు అవుతోంది. అంతే.. దాదాపు రెండేళ్లు ధనుష్ తెలుగు సినిమాలతో బిజీ. వాస్తవానికి తెలుగులో ధనుష్ కి పెద్దగా మార్కెట్ లేదు. వరుసగా రెండు, మూడు తెలుగు సినిమాలు చేసి.. ఆ మార్కెట్ ని పెంచుకొనే ప్రయత్నమే ఇదని చెబుతున్నారు.