మంత్రులని కంట్రోల్ లో పెట్టుకోండి.. కేసీఆర్ !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మళ్లీ మొదలైంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్రమం అంటూ తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. ఏపీ సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే వీరికి గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఏపీ మంత్రులు. దీంతో ఏపీ వద్ద తప్పు ఉందనే భావన ప్రజల్లో కలుగుతోంది.

ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య రంగంలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక కోసమే తెలంగాణ నేతలు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని.. వారిని కంట్రోల్ లో పెట్టాలని సీఎం కేసీఆర్ కు సూచించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారని.. రాష్ట్రానికి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నాని రామచంద్రయ్య స్పష్టం చేశారు.