ఆ సంస్కారం తెరాసలో లేదు : ఈటెల

మంత్రులు, పార్టీ నేతలకు విలువ ఇచ్చే సంస్కారం తెరాసలో లేదని మాజీ మంత్రి, భాజాపా నేత ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎన్నికలప్పుడు హామీలతో మభ్యపెట్టి గెలవడమే తెరాసకు తెలుసు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కొందరు పోలీసులు చట్టాలకు లోబడి కాకుండా చుట్టాలకు లోబడి చేస్తున్నారని ఈటల విమర్శించారు.

తెలంగాణలో మరోసారి దళితులను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని.. ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు కేటాయించే నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని ఈటెల ఆరోపించారు. తెల్ల కాగితంపై రాసుకుని కొనుగోలు చేసిన భూములు మళ్లీ దొరలకే వెళ్లాయి.  చిత్తశుద్ధి ఉంటే ఈ ఏడేళ్లలో ఎస్సీలకు ఎంతో చేసి ఉండొచ్చని ఈటెల అన్నారు.