రాజమౌళి-మహేష్ సినిమా పనులు షురు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఇప్పటికే ఫిక్సయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుతో రాజమౌళి తదుపరి సినిమా ఉండనుంది. కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా వ్యవహారాలు మొదలైపోయినట్టు సమాచారమ్. ఇప్పటికే నిర్మాత కేఎల్ నారాయణ పలుసార్లు రాజమౌళిని అలాగే మహేష్ బాబును కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. రాజమౌళి కూడా మహేష్ బాబును కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

సాధారణంగా సినిమా సినిమాకి మధ్య రాజమౌళి చాలా గ్యాప్ తీసుకుంటారు. ఈ గ్యాప్ లో సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తారు. అయితే ఈ సారి కరోనాతో వచ్చిన ఖాళీ టైమ్ లోనే మహేష్ సినిమాపై కసరత్తు చేసినట్టు.. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన కొద్ది గ్యాప్ లోనే మహేష్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహెష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మహెష్ సినిమా ఉండనుంది. 2022 సమ్మర్ రిలీజ్ గా పెట్టుకున్నారు. ఆ వెంటనే రాజమౌళి-మహేష్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ.. మహేష్ కోసం జక్కన ఎలాంటి కథని రాసుకున్నారు ? అన్నది ఆసక్తిగా మారింది.