AP కరోనా రిపోర్ట్ : 3,841 కేసులు, 38 మరణాలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,841 కొత్త కేసులు నమోదయ్యాయి. 38 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 3,963 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,178 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక మృతుల్లో కరోనా వల్ల కృష్ణాలో 8, చిత్తూరులో 5, తూర్పుగోదావరిలో 5, గుంటూరులో 5, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, నెల్లూరులో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు.