ఆరోపణలు సరే.. ఆధారాలేవీ రఘురామ ?

ఏపీ సీఎం జగన్ మళ్లీ జైలుకు వెఌతే చూడాలని ఆశపడుతున్నాడు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. రఘురామ ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

జగన్‌, రఘురామ వాదనల తర్వాత లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ… కోర్టుకు తెలిపింది. చివరగా.. జగన్‌, రఘురామ, సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించిన సీబీఐ న్యాయస్థానం.. విచారణ ఈనెల 8కి వాయిదా వేసింది.