తాప్సీ-కంగనా.. మళ్లీ గెలుక్కున్నారు !

బాలీవుడ్ హీరోయిన్స్ తాప్సీ పన్ను-కంగనా రనౌత్ మధ్య కోల్డ్‌వార్‌ ఇప్పట్లో కంట్రోలయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు సోషల్‌మీడియా వేదికగా మాటల చురకలు పెట్టుకున్న ఈ భామలు చాలారోజుల తర్వాత మరోసారి వాగ్వాదానికి తెర తీస్తున్నారు.

ఇటీవల కొన్నిరోజులపాటు రష్యా టూర్‌కు వెళ్లి వచ్చిన తాప్సీ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘హసీనా దిల్‌రుబా’ ప్రమోషన్‌లో బిజీగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ప్రమోషన్‌లో భాగంగా.. ‘కంగనకు తన జీవితంలో ఎలాంటి ప్రాధాన్యం లేదు’ అని తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగన స్పందించారు. దీనిపై కంగనా తనదైన శైలిలో స్పందించారు.

“చిన్నస్థాయి నిర్మాతలకు కంగనా రనౌత్‌లా మారినందుకు తాను ఎంతో గర్వపడుతున్నానని తాప్సీ ఒకానొక సమయంలో చెప్పారు. కానీ ఇప్పుడు, తన జీవితంలో నాకు ఎలాంటి ప్రాధాన్యం లేదు అంటున్నారు. మనుషుల కుళ్లు స్వభావానికి ఇదో నిదర్శనం. ఏది ఏమైనా తాప్సీ.. నీ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా. అలాగే, నా పేరు లేకుండా నీ సినిమా ప్రమోట్‌ చేసుకో” అని కంగన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.