గిల్’కు గాయం

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కాలికి గాయమైందని సమాచారం. గాయం తీవ్రమైంది కావడంతో అతడికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు గిల్ దూరమయ్యే అవకాశముంది.

 శుభ్‌మన్‌ కోలుకుని తిరిగి సిరీస్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌లో ఒకరు అతడి స్థానాన్ని భర్తీ చేసే వీలుంది. మరోవైపు గిల్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ జట్టులో రావొచ్చని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన గిల్.. WTC ఫైనల్ లో మాత్రం ఆ స్థాయిలో ఆడలేకపోయాడు.