‘ఎమ్మార్వో’గా రవితేజ

మాస్ మహారాజ రవితేజకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఆయన ఎమ్మార్వో అయ్యారు. ప్రస్తుతం ‘ఖిలాడీ’ సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమా తర్వాత కొత్త దర్శకుడు శరత్ దర్శకత్వంలో రవితేజ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘ఎమ్మార్వో’ అనే టైటిల్ ను పరిశీలనలో వుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తాడని, ఈ సినిమాలో కూడా ఎర్రచందనం రవాణా లాంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది. ఎర్రచందనం స్మిగ్లింగ్ మూఠా ఆట ఎమ్మోర్వో ఎలా కట్టించాడు అనేది కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమాని సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయ్.