ఏపీలో 3,464 కొత్త కేసులు, 35 మరణాలు

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది.

కొవిడ్‌ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, కడప, కర్నూలు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు.