యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు

బాలీవుడ్ హీరోయిన్ నటి యామీ గౌతమ్‌కి ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్‌ కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి.  విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. జులై 7న ఈడీ ఎదుట హాజరు కావాలని కోరింది.

కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’తో యామి గౌతమ్‌ తెరకు పరిచయం అయింది. ‘విక్కీ డోనర్‌’ సినిమాతో బాలీవుడ్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత  ‘యాక్షన్‌ జాక్సన్‌’, ‘బద్లాపూర్‌’, ‘ఉరి’, ‘బాలా’ చిత్రాలతో ఆమె ప్రేక్షకులను మెప్పించారు. ఇటీవల ఆమె ‘ఉరి’ చిత్ర దర్శకుడు ఆదిత్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. యామి పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.