జగన్ దొరికాడు.. ఇక ‘యాత్ర 2’ షురు !

వైఎస్ఆర్ బయోపిక్ ని ‘యాత్ర’గా తీసుకొచ్చాడు దర్శకుడు మహి వి రాఘవ. యాత్ర సినిమాలో వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి పోషించారు. దివంగత నేతను మరోసారి తెలుగు ప్రజలకు గుర్తుచేశారు. ఆహార్యంతో అచ్చుగుద్దినట్టు వైఎస్ఆర్ ను తలపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజైన ‘యాత్ర’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్నికల్లో వైసీపీకి మైలేజ్ కూడా ఇచ్చింది.

యాత్ర రిలీజ్ టైమ్ లోనే సీక్వెల్ తీస్తానని దర్శకుడు మహి వి రాఘవ్ ప్రకటిమ్చారు. ఆ తర్వాత ఆ సీక్వెల్ కాస్తా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా మారింది. జగన్ రాజకీయ ప్రస్థానంపై సినిమా చేస్తానని మహి ప్రకటించాడు. ఇక జగన్ పాత్రలో నటుడు అజ్మల్ కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు మహి బాలీవుడ్ నటుడ్ని ఎంచుకున్నాడు. స్కామ్-1992లో నటించిన ప్రతీక్ గాంధీని సెలక్ట్ చేశాడు. దీంతో.. త్వరలోనే యాత్ర 2 పనులు షురు కానున్నాయి.