తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. తెలంగాణ మంత్రులు ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి ఏపీ అక్రమ ప్రాజెక్టులని కడుతోందని ఆరోపిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈరోజు కూడా మీడియా ముందుకొచ్చారు. అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.

తెలంఅగాణలో అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులు లేవని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంలు ఇచ్చిన జీవోలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నీటి పంపకాల్లో కేంద్రం కూడా వివక్ష చూపుతోందని ఆరోపించారు.