కత్తి మహేష్ కు ఏపీ ప్రభుత్వ సాయం రూ. 17లక్షలు

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేశ్‌ గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. ముక్కు, కళ్లకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం మహేశ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో మహేశ్‌ చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. రూ.17లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద చెన్నైలోని అపోలో ఆస్పత్రికి జమ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మహేష్ వైద్య ఖర్చుల కోసం ఫండింగ్ మొదలు పెట్టారనే ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మహేష్ కుటుంబ సభ్యులు ఖండించారు. మహేష్ సన్నిహితులు, స్నేహితులు ముందుకొచ్చి సాయం చేస్తున్నారని తెలిపారు.