అత్యధిక పరుగుల రికార్డ్ ని బ్రేక్ చేసిన మిథాలీ

భారత మహిళా క్రికెట్ స్టార్ మిథాలీ రాజ్ కొత్త రికార్డ్ కొట్టింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ చార్లెట్‌ ఎడ్వర్డ్స్‌ (10,273 పరుగులు)ను ఉండేది. ఇప్పుడీ. ఈమె రికార్డ్ మిథాలీ చెరిపేసింది. మిథాలీ రికార్డ్ పై క్రెకెట్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు.

ఇక ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో టీమిండియా  5 వికెట్ల తేడాతో గెలుపొందింది. డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధితిలో సాగిన పోరులో ఇంగ్లండ్‌ నిర్ణీత 47 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 46.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.