రెండు సినిమాలని దాచిపెట్టిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు సడెన్ షాక్ తగిలింది. ప్రస్తుతం ‘ప్రభాస్‌ 25’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణలో ఉండగానే ప్రభాస్‌ 21వ చిత్రంగా నాగ్‌ అశ్విన్‌ మూవీని ప్రకటించారు. అయితే, మధ్యలో ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’ వచ్చాయి. దీంతో నాగ్‌ అశ్విన్‌ చిత్రం ప్రభాస్‌ తన 23వ మూవీ అయింది.

ఈ నేపథ్యంలో నాగీ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్‌ డానీ సాలో ఇన్‌స్టాలో ‘ప్రభాస్‌ 25వ మూవీ ఓ మైలురాయి’ అని అర్థం వచ్చేలా పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. నాగీ చిత్రం ప్రభాస్‌ 25వ మూవీ అయితే, మరి 23, 24 చిత్రాలు ఎవరితో అన్న ఆసక్తి మొదలైంది. 

‘సలార్‌’ తర్వాత ప్రభాస్‌ బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ మూవీ, ప్రశాంత్‌నీల్‌తో మరో మూవీ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. సిద్ధార్థ్ మూవీ ‘ధూమ్‌’ సిరీస్‌లో భాగంగా తెరకెక్కనుందట. ధూమ్ సిరీస్ లో ప్రభాస్ కనిపించబోతున్నట్టు గతంలోనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ.. ఈ ప్రచారం నిజం కాబోతుంది అన్నమాట.