‘ఉప్పెన’ కాంబోలో మరో సినిమా

కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ లతొ వచ్చిన ‘ఉప్పెన’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా రూ. 50కోట్లు వసూలు చేసింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి జంటగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సినిమాలో అతడే నిజమైన హీరో అని సినిమా చూసిన ప్రేక్షకులు జడ్జిమెంట్ ఇచ్చేశారు. అంతలా పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించింది.

ఇక బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రీలోనే. ఓ స్టార్ హీరోతో ఈ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్దామ‌నుకున్నారు. కానీ బుచ్చికి ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేదు. ఎన్టీఆర్, బ‌న్నీల‌తో బుచ్చి ట‌చ్‌లో ఉన్నా, వాళ్లు బుచ్చితో సినిమాలు చేయ‌డానికి రెడీగా ఉన్నా – డేట్లు స‌ర్దుబాటు కావ‌డం లేదు. అందుకే ఉప్పెన టీమ్ ని రిపీట్ చేస్తూ.. ఓ చిన్ని సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అయినట్టు సమాచారమ్. వైష్ణవ్-కృతి మరోసారి తెరను పంచుకోనున్నారు. కథ-కమీషు ఏంటీ ? అన్నది తెలియాల్సి ఉంది.