మళ్లీ పెరుగుతున్న కరోనా మరణాలు

దేశంలో కరోనా కేసులు, మరణాలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 1,206 మంది కరోనాతో మృతి చెందారు. కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న మరణాల సంఖ్య నిన్న భారీగా పెరిగాయి.

ప్రస్తుతం దేశంలో మొత్తం కేసులు 3,07,95,716కి చేరగా.. 4,07,145 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇక 24 గంటల వ్యవధిలో 45,254 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.99 కోట్లకు చేరగా.. ఆ రేటు 97.20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,55,033 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.48 శాతానికి తగ్గింది.