నటుడు కత్తి మహేష్ కన్నుమూత

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సినీ విశ్లేషకుడు, నటుడు కన్నుమూశారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నైలో అపోలో ఆస్పత్రికి తరలించారు. ముక్కు, కళ్లకు శస్త్ర చికిత్స చేశారు.

మహేశ్ వైద్య కోసం ఏపీ ప్రభుత్వం కూడా సాయం చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 17 లక్షలు అందించింది. మహేష్ ఆరోగ్యం క్రమ క్రమంగా కోలుకుంటుంది అనుకున్నారు. ఇంతలోనే విషాదం నెలకొంది. మహేష్ మరణవార్త వినాల్సి వచ్చింది. ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందినట్టు వైద్యులు చెప్పినట్టు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు మహేశ్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.