లైన్ లోకి వచ్చిన నిధి

చూపులు పక్కకు తిప్పుకోనివ్వని.. నిండైన అందాలు నిధి అగర్వాల్ సొంతం. ఆ అందాలని ఆరబోస్తూ అప్పట్లో హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసేది. అయితే కేవలం గ్లామర్ షోతో పని కాదని జ్ఝానోదయం అయినట్టుంది. నటనపై ఫోకస్ పెట్టింది. మరీ.. బిజీ కాకపోయినా.. ఖాళీ  ఉండటం లేదు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో తన తలరాత మారుతోంది. బిజీ హీరోయిన్ అయిపోతానని కలలు కంటోంది.

ఈ ఊపులో మళ్లీ గ్లామర్ షో మొదలెట్టింది. తాజాగా ఫ్రష్ ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘సూర్యుడు వెళ్లిపోతున్నాడు’ అని కామెంట్ పెట్టింది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సవ్యసాచి సినిమాతో నిధి తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ఝ్ను, సినిమాలో నటించింది. ఇక ఇస్మార్ట్ శంకర్ తో తొలి హిట్ అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నిధికి అవకాశాలు వస్తున్నాయి.