తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్‌

కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రవిశంకర్‌ ప్రసాద్‌ ఇటీవల మంత్రివర్గ విస్తరణ క్రమంలో పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చారు. తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. తాజాగా రవిశంకర్ ప్రసాద్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇటీవల మంత్రివర్గ విస్తరణ క్రమంలో రవిశంకర్ ప్రసాద్ తో పాటుగా ప్రకాశ్ జావడేకర్‌, డాక్టర్‌ హర్షవర్దన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌, సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, సదానందగౌడతో పాటు రతన్‌లాల్‌ కటారియా, దేవశ్రీ చౌధురి, సంజయ్‌ ధోత్రే, రావు సాహెబ్‌ ధన్వే పాటిల్‌, అశ్వినీ చౌబే, బాబుల్‌ సుప్రియోలకు ఉద్వాసనకు గురయ్యారు.