విండీస్ చేతిలో ఆసీస్ కు రెండో ఓటమి

ఆస్ట్రేలియాకు విండీస్ రెండోసారి షాక్ ఇచ్చింది. గతరాత్రి జరిగిన రెండో టీ20లో ఆసీస్ పై విండీస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నాలుగు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సిమ్మన్స్‌ (30; 21 బంతుల్లో 1×4, 3×6), హెట్‌మైయిర్‌ (61; 36 బంతుల్లో 2×4, 4×6), బ్రావో (47; 34 బంతుల్లో 1×4, 3×6), రసెల్‌ (24; 8 బంతుల్లో 2×4, 2×6) రాణించడంతో.. విండీస్ 196 పరుగులు చేసింది. 

197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. మిచెల్‌ మార్ష్‌ (54; 42 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే అర్ధశతకంతో రాణించాడు. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో విండీస్ 2-0 ఆధిక్యం సంపాదించింది.