కాంగ్రెస్’కు కౌశిక్ రెడ్డి రాజీనామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు !

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపారు. గతంలో హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఈటల చేతిలో ఓటమిపాలైన పాడి కౌశిక్‌ రెడ్డిని తెరాసలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తనకే ఖరారైందని కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తలో మాట్లాడిన ఆడియో అనూహ్యంగా లీకైంది. దీంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

కౌశిక్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని కోరింది. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి స్పందించారు. ఏకంగా పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్స్ కూడా దక్కవని హెచ్చరించారు.

పోతూ.. పోతూ.. కాంగ్రెస్ పార్టీ, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి రూ. 50లక్షలు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. రేవంత్ ని ముమైత్ ఖాన్ తో పోల్చాడు. ముమైత్ ఖాన్ వచ్చి చేతులు ఊపితే.. జనాలు చప్పట్లు కొడతారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముమైత్ ఖాన్ అని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి.. రేవంత్ రెడ్డిని దాదాపు రేప్ చేసినంత పనిచేశాడు కౌశిక్ రెడ్డి.