‘సర్కారు వారి పాట’ మళ్లీ షూటింగ్ మొదలు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మరోసారి సినీ షూటింగ్స్ కి బ్రేక్ పడింది. థియేటర్స్ మూతపడ్డాయ్. ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయ్. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభం అవుతున్నాయి. తాజాగా సర్కారు వారి పాట షూటింగ్ మళ్లీ మొదలైంది. ఈ మేరకు చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది.

ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత ఆయన చేస్తున్న చిత్రమిది. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంక్ దోపిడి నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఆయనది సినిమాలో డ్యూయెల్ రోల్ అనే ప్రచారం కూడా ఉంది. దీనిపై చిత్రబృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.