కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్ కౌంటర్

హుజూరాబాద్ కి చెందిన కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచల వ్యాఖ్యలు చేశారు. రూ. 50కోట్లు మాణికం ఠాగూర్‌కు ముట్టజెప్పి రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షపదవిని పొందారని కౌశిక్ ఆరోపించారు. అంతేకాదు.. కాంగ్రెస్ సీనియర్లు ఎవ్వరూ హ్యాపీగా లేరు. త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ కానుందన్నారు. ఇప్పుడు కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి.

కౌంటర్ రాజకీయ గురువుగా చెప్పబడే ఉత్తమ్ కుమార్ రెడ్డినే మొదట మొదలెట్టారు. కౌశిక్‌.. స్థాయి తెలుసుకొని మాట్లాడు అని హెచ్చరించాడు. రేవంత్‌రెడ్డి, మాణికం ఠాగూర్‌పై కౌశిక్‌ చేసిన ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెరాస నాయకులే కౌశిక్‌రెడ్డితో ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఏ నాయకుడైనా స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

మరోవైపు కౌశిక్‌రెడ్డి ఉత్తమ్ మాట జవదాటడు. ఆయనకు తెలివకుండా కాంగ్రెస్ కు రాజీనామా చేయడు. తెరాసలో చేరేందుకు రెడీ కాడు. కౌశిక్‌రెడ్డి వెనక ఉత్తమ్ నే ఉన్నాడు. బహుశా.. కౌశిక్‌రెడ్డి రెడ్డి దారిలోనే త్వరలోనే ఉత్తమ్ కూడా కారెక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కానీ ఉత్తమ్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్టుగా కౌశిక్‌రెడ్డికి కౌంటర్ ఇవ్వడం విశేషం. రాజకీయాలంటే అంతే మరీ.. !