ఉత్తమ్ కూడా కారెక్కుతాడా !?

కౌశిక్ రెడ్డి కారెక్కడం దాదాపు ఖాయమైంది. ఇటీవలే ఆయన మంత్రి కేటీఆర్ ని కలిశారు. అప్పటి నుంచే కౌశిక్ రెడ్డి తెరాసలో చేరబోతున్నారు. హుజూరాబాద్ తెరాస టికెట్ ఆయనకే దక్కనుందే ప్రచారం జరుగుతోంది. తాజాగా హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే అంటూ కౌశిక్ రెడ్డి చెప్పిన ఓ ఆడియో లీకైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో..  కౌశిక్ రెడ్డి కారెక్కడం ఖాయమైందని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి.. తెరాసలో చేరబోతున్నట్టు సమాచారమ్.

ఎందుకంటే ? ఉత్తమ్ మాట కౌశిక్ రెడ్డి జవ దాటడు. అలాంటి కౌశిక్ రెడ్డిని తెరాసలోకి పంపిస్తోంది ఉత్తమ్ నే అనే ప్రచారం ఉంది. ఇదీగాక.. కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ లు గా పని చేసిన వారు కారెక్కడం సెంటిమెంట్ గా వస్తోంది. పీసీసీ చీఫ్ లుగా కె. కేశరావు, డి శ్రీనివాస్ తెరాసలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ.. ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ.. ఉత్తమ్ కూడా కారెక్కబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరీ.. ఈ ప్రచారం నిజమవుతుందా ? ఉత్తమ్ కార్కెక్కుతారా ?? చూడాలి.