TSలో 767 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 767 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,738కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 848 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,064 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇక ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,26,988కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 18 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,042కి చేరింది. నిన్న 3,034 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,87,236కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 యాక్టివ్‌ కేసులున్నాయి.