నారప్ప 40కోట్లు, దృశ్యం2 36 కోట్లు !

సినిమా బిజినెస్ డీల్స్ చేయడంలో నిర్మాత సురేష్ బాబు దిట్ట. తన భాగస్వామ్యంలో, ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించిన వెంకటేష్ సినిమాలతో తాజాగా భారీ లాభాలు దక్కించుకున్నారు సురేష్ బాబు. వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద అమెజాన్ ప్రైమ్ కు ఇచ్చేశారు. ఈ డీల్ తో ఏకంగా 40 కోట్ల రూపాయల్ని దక్కించుకున్నారు.

ఇక వెంకీ నటించిన మరో చిత్రం దృశ్యం 2. ఇది కూడా రిమేక్ నే. ఈ సినిమా షూటింగ్ ని కేవలం నెలరోజుల్లోనే పూర్తి చేశారు. కానీ లాభాలు మాత్రం భారీగా దండుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి మొత్తం హక్కుల్ని (డిజిటల్, శాటిలైట్, డైరక్ట్ ఓటీటీ రిలీజ్) 36 కోట్ల రూపాయలకు అమ్మేశారు. వెంకీ రెండు సినిమాలు ఏకంగా రూ. 75కోట్లకుపైగా అమ్ముడు పోయాయ్. టేబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టాయి.