థర్డ్ వేవ్ పై ప్రధాని హెచ్చరిక

కరోనా వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఇటీవలకాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో..ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మంగళవారం మాట్లాడారు.

కరోనావైరస్ దానంతట అదే రాదు.. పోదు. నియమాలను ఉల్లంఘించి దాన్ని మనతో తీసుకువస్తామని ప్రధాని అన్నారు. నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, గుంపులుగా చేరడంతో కేసులు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కరోనా వేరియంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అవి ప్రపంచ వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించాయి. ఇది ఎంజాయ్ చేసే సమయం కాదు అని ప్రజలు, ప్రభుత్వాలకు ప్రధాని సూచించారు.