కౌశిక్‌ రెడ్డి కామెంట్స్ పై రేవంత్ స్పందన

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్‌కు రూ.50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని కౌశిక్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. కౌశిక్‌రెడ్డి చిన్న పిల్లవాడు. ఆ మాటలు అతనివి కావు. సీఎం కేసీఆర్‌ మాట్లాడించినవి అన్నారు. కౌశిక్‌ రెడ్డి తెరాసతో టచ్‌లో ఉన్న విషయం నాకు ముందే తెలుసు.ప్రస్తుతం హుజూరాబాద్‌లో తెరాసకు సరైన అభ్యర్థి లేనందునే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారని రేవంత్ అన్నారు.

ఇక తెదేపా తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఎల్‌ రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి.. ఆ తరువాత సీఎం కేసీఆర్ తెరాసలోకి తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని..  రెండు, మూడు రోజుల్లో పీసీసీ అధికార ప్రతినిధులను నియమించనున్నట్లు రేవంత్ చెప్పారు.