జల వివాదం.. సుప్రీంకు ఏపీ !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. అది కాస్త విద్యుత్ వివాదంగా మారింది. అన్నీ ప్రాజెక్టుల వద్ద పోలీసుల పహారా దాక వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

సోమవారం మీడియాతో మాట్లాడిన సజ్జల..  తెలంగాణ చర్యల వల్ల నీరు వృథాగా సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపార నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగరాదనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు.