కత్తి మహేష్ తండ్రి సంచలన ఆరోపణలు

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చనిపోయే ముందు కత్తి మహేష్ కు ఆక్సిజన్ పైప్ పీకేశారు. వెంటిలేటర్ పై నుంచి తొలగించారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా కత్తి మహేష్ తండ్రి ఓబులేష్.. కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కొడుకు చనిపోయాడనే విషయాన్ని డాక్టర్లు ముందు తమకు చెప్పలేదని.. ఒకేసారి అందరికీ చెప్పేశారని అన్నారు. కొడుకు మృతిపై దర్యాప్తు చేయాలని ఆయన ఏపీ సీఎం జగన్ కు విజ్ఝప్తి చేశారు.

మరోవైపు కత్తి మహేష్ డ్రైవర్ ని పోలీసులు మంగళవారం విచారించారు. ఈరోజు కూడా మరోసారి డ్రైవర్ ని విచారించనున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు ఆదేశాలు వస్తే గనుక మరింత లోతుగా ఈ కేసుని విచారించే అవకాశాలు ఉన్నాయి. గత నెల 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ఘోరంగా గాయపడ్డారు. ఆయన్నిమెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 10న కత్తి మహేశ్ తుదిశ్వాస విడిచారు.