భారీగా తగ్గిన కరోనా కేసులు.. మరణాలు !

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,093 కొత్త కేసులు నమోదు కాగా.. 374 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.11 కోట్లకు చేరగా..4.14లక్షల మంది వైరస్‌కు బలయ్యారు.

ఇక క్రియాశీల కేసులు 4లక్షలకు తగ్గడం ఊరటనిచ్చే విషయం. మరోవైపు నిన్న 45వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.03 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు 1.35 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.32 శాతంగా ఉంది.