భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక ఆదేశాలు !

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉద్ధృతి పెరుగుతున్నందున యుద్ధప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కేసీఆర్ సూచించారు. రానున్న రెండు రోజులు అత్యంత భారీ స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి ఉన్నందున ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం పిలుపు నిచ్చారు. వాగులు, వంకలన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.