Auto ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు !

కె.రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న వింటేజ్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే కథానాయిక. ‘సాహో’ విడుదలైన తర్వాత ప్రభాస్ టేకప్ చేసిన సినిమా ఇది. ఇటలీలో భారీ సెట్‌ క్రియేట్‌ చేసి ప్రధాన సన్నివేశాల షూట్‌ అక్కడే పూర్తి చేశారు. చిత్రీకరణ చివరిదశకు వచ్చిన సమయంలో కరోనా కారణంగా షూటింగ్‌ పలుమార్లు వాయిదా పడటం జరిగింది.

ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ‘రాధేశ్యామ్‌’ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు. చివరి షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘రాధేశ్యామ్‌’ టీమ్‌ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. త్వరలోనే పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు పూర్తి చేసుకుని ఈ ప్రేమకథా చిత్రం ప్రేక్షకుల తీసుకురానున్నారు. రాధేశ్యామ్ పూర్తికావడంతో.. ప్రభాస్ మిగతా పాన్ ఇండియా
సినిమాలపై ఫోకస్ పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు ఉన్నాయి.