ఈరోజే CBSE 12వ తరగతి ఫలితాలు

CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ (cbseresults.nic.in) లో ఫలితాలు చూసుకోవచ్చు. 

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను జులై 31లోగా సీబీఎస్‌ ప్రటించాలని భావిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకు తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్ధేశించుకున్న గడువుకు ఒక్కరోజు ముందే ఫలితాలని విడుదల చేస్తున్నారు.